పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి....!

byసూర్య | Thu, Sep 26, 2024, 03:36 PM

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బుధవారం వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి దీన్ దయాళ్ నగర్ లోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు..
భారత రాజకీయాల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ కొత్త ఒరవడిని సృష్టించారని గుర్తుచేసారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మొదట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్... ఆ తర్వాత భారతీయ జనసంఘ్ ద్వారా రాజకీయా రంగ ప్రవేశం చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మార్చేసారని అన్నారు. 
ఆయన అందించిన ఆలోచనలు నేడు భారతదేశానికే కాకుండా ప్రపంచ సమాజానికి కూడా మార్గనిర్దేశం చేసాయని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్ తరాలకు ఆయన ఓ దిక్సూచి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పార్టీ నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM