byసూర్య | Thu, Sep 26, 2024, 03:30 PM
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ పూలమాలతో ఘన నివాళులు అర్పించినారు.
ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక పోరాటాలు చేసిన ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పోరాటం చేశారని మాజీ మంత్రి కొనియాడారు.