byసూర్య | Thu, Sep 26, 2024, 03:25 PM
నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ఆమె విగ్రహానికి గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజా రాణి, కాంగ్రెస్ నాయకులు తుపాజి అనంతకృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు.