byసూర్య | Tue, Sep 24, 2024, 02:59 PM
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ స్పందన ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఇందులో 103 మంది కి ఓ.పి నిర్వహించి అందులో 18 మందికి రక్త నమూనాలు సేకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఎవరికైనా జ్వరాలు వస్తి ఆందోళన చెందనవసరం లేదని డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే తగ్గిపోతుందని, జ్వరాలు వస్తే ఆందోళన చెందావనం లేదని వైరల్ ఫీవర్లో విపరీతమైన శరీరం నొప్పులు ఉంటాయని తెలిపారు.అలాగే కుటుంబ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోరారు.నేడు గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డా.నరసింగరావు, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.