బదిలీ ఉపాధ్యాయులకు వీడ్కోలు

byసూర్య | Sat, Sep 21, 2024, 02:26 PM

మహబూబాబాద్ జిల్లా, జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల గూడూరు నుండి, బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశము, అదేవిధంగా పాఠశాలకు విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు స్వాగతం  తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళుతున్న  టి. నిర్మల ఫిజికల్ డైరెక్టర్, ఏ. అరుణ ఆఫీస్ అబార్డినేట్ లకు, వీడ్కోలు పలికారు. నైట్ వాచ్మెన్ గా పనిచేసిన జి. సాంబయ్య, ఈ పాఠశాలలోనే రిటైర్ మెంట్ అయ్యారు.
వారిని ఉపాధ్యాయ బృందం సన్మానించారు. ఈ పాఠశాలకు బదిలీపై విచ్చేసిన, ఉపాధ్యాయులు గుర్రాల వెంకటేశ్వర్లు  ఆంగ్ల శాస్త్ర బోధకులు, గుమ్మడి వెంకటేశ్వర్లు ఫిజికల్ డైరెక్టర్, వంగరాజు జీవశాస్త్ర బోధకులు ఈ పాఠశాలకు బదిలీపై విచ్చేశారు. వీరిని శాలువా పూలమాల తో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సదాశివ, పాఠశాల సెక్రటరీ జి. శ్రీనివాస్,  పెండెం హరి శంకర్, ఈ. సునీత, ఎండి. మహబూబ్ అలీ, శరత్ బాబు, దిడ్డి అనిల్ కుమార్, ఎం. శ్రీధర్, వెంకటేశ్వర్లు, సంధ్యారాణి, సులోచన, యాక లక్ష్మి, ప్రమీల, రికార్డ్ అసిస్టెంట్ గుగ్గిల లచ్చయ్య  పాల్గొన్నారు.


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM