దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి సయ్యద్‌ మక్బూల్‌ మృతి

byసూర్య | Fri, Jul 26, 2024, 03:45 PM

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది సయ్యద్‌ మక్బూల్‌ (52)మృతి చెందాడు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న మక్బూల్‌..కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 30 రోజుల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. తర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించింది. ఈక్రమంలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో ఆయన హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో ఆయనకు దిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. 6 నెలల క్రితం సయ్యద్‌ మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆయన్ను దిల్లీ నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు.


మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సయ్యద్ మక్బూల్‌ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి సన్నిహితుడనే పేరుంది. 2006లో వారణాసి, 2007లో ముంబయి వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, 2008 దిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతోపాటు దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ ప్రస్తావించింది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM