ఆ హోదాలో తొలిసారి,,,,అసెంబ్లీకి కేసీఆర్

byసూర్య | Thu, Jul 25, 2024, 07:41 PM

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావటం ఉత్కంఠ నెలకొంది. ఆయన హాజరవుతారా? లేదా? అనే టెన్షన్ నెలకొని ఉండగా.. దానికి తెరదించుతూ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్ కాలు జారి కిందపడి ఆసుపత్రి పాలుకావటంతో ఆ సమావేశాలకు హాజరు కాలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఆ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సభకు దూరంగా ఉన్నారు.


ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా.. అసెంబ్లీకి హాజరైన కేసీఆర్


అయితే ప్రస్తుతం జరిగే సభకు ఆయన హాజరుపై గత నాలుగైదు రోజులుగా చర్చ జరుగుతోంది. ఆయన వస్తారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొని ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత.. బుధవారం జరిగిన చర్చలో కేసీఆర్ సభకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దానికి బదులిచ్చిన కేటీఆర్.. కేసీఆర్ రావాల్సిన పని లేదని మీకు సమాధానం చెప్పడానికి మేం చాలని అన్నారు. దీంతో కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ అనుహ్యంగా ఆయన నేడు సభకు హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి సభకు హాజరయ్యారు.


అంతకు ముందు నంది నగర్‌లోని కేసీఆర్ నివాసం వద్ద కార్యకర్తలు సందడి చేశారు. కాగా, నేడు బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు కాళేశ్వరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించనున్నారు.


Latest News
 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM