byసూర్య | Fri, Jul 12, 2024, 10:18 AM
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంగి బి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి శాదుల్ కు జంగి మాజీ ఎంపీటీసీ వెంకట్రావు ఘనంగా సన్మానించారు. ఇటీవల మాగి షుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్గా ఎంపికవడంతో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హీనా ఫారుక్ తదితరులు ఉన్నారు.