byసూర్య | Fri, Jul 12, 2024, 11:00 AM
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఫ్లిప్ కార్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కీర్తన, అక్షిల్యా వైద్య బృందంచే మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎంపీడీవో ఉమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఫ్లిప్ కార్డ్ వారు మారుమూల పల్లెలను ఎంపిక చేసుకొని, బడుగు బలహీన వర్గాల వారికి సామాన్యులకు సైతం వైద్య సేవలు అందించడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు.