byసూర్య | Thu, Jul 11, 2024, 04:05 PM
బాలల హక్కులను పరిరక్షించే విధంగా చిల్డ్రన్స్ హోంను నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి మాధవిలత అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచన మేరకు బుధవారం భువనగిరిలోని నిరీక్షణ చిల్డ్రన్ హోంను సందర్శించారు. పిల్లల సంరక్షణ చట్టం లోబడి చిల్డ్రన్ హోమ్స్ ను నిర్వహించాలని తెలిపారు. పిల్లలకు హోమ్ లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.