byసూర్య | Thu, Jul 11, 2024, 03:34 PM
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆర్ఎంను నాయకులు గురువారం ఆర్ఎం కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఎంకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆర్ఎం పర్యవేక్షణలో ఆర్టీసీ లాభాల బాట పట్టాలని వారు ఆకాంక్షించారు. కార్మికుల సమస్యల పట్ల ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందించి, కార్మికుల కష్టాలను గుర్తించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.