![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 04:04 PM
మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, మహిళల రక్షణ కొరకే షీ టీం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సింధుశర్మ బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ప్రతి సబ్ డివిజన్ కు ఒక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ స్థాయి ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 3 షీ టీంలను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న మహిళలకు భద్రత కల్పిస్తూ భరోసా ఇస్తున్నామన్నారు. జనవరి నుండి ఇప్పటివరకు మొత్తం 145 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.