byసూర్య | Wed, Jul 10, 2024, 03:55 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలో బుధవారం నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా రంగంపై అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యారంగం సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.