byసూర్య | Wed, Jul 10, 2024, 03:06 PM
ప్రేమ పేరుతో ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ బి. సురేశ్ తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన సంతోష్ గత మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమ పేరుతో దగ్గరైయ్యాడు. వివాహంపై ఆ యువతి ప్రశ్నించగా తప్పించుకు తిరుగుతున్నాడు. పెద్దలతో మాట్లాడినా మార్పు రాకపోవడంతో మోసం చేసిన సంతోష్ తో పాటు అతని తల్లి జానకిపై కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తెలిపారు.