![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 02:50 PM
రాబోయే పార్లమెంట్ సమావేశాలలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక భాస్కర్ టాకీస్ అడ్డా ప్రదేశంలో జూలై 10 కార్మికుల కోరికల దినం సందర్భంగా కార్మికులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కార్మికులను కట్టు బానిసలు చేయడానికి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు.