![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 02:45 PM
కారేపల్లి మండల వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో రైతులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, పెసర వంటి పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. బుధవారం కాస్త వర్షం ఆగిపోవడంతో రైతులు ఆయా పంటచేలాల్లో కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. పంటల ఎదుగుదలకు అవసరమైన ఎరువులను వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వాడుకుంటున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలను వేడుకుంటున్నారు.