byసూర్య | Wed, Jul 10, 2024, 02:45 PM
బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దేవరకొండ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సభ్యుడు కుక్కముడి వీరయ్యకు పార్టీ కల్పించిన ప్రమాద భీమా ద్వారా వచ్చిన రూ. 2 లక్షల చెక్కును బుధవారం నామిని పార్వతమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజు, కృష్ణ, వాజీద్ పాషా, మైబెల్లి, మురళి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.