byసూర్య | Tue, Jul 09, 2024, 04:12 PM
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంగళవారం హైదరాబాదులోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ టిపిసిసి సభ్యులు కాసుల బాలరాజుకు పార్టీ అధిష్టానం కార్పొరేషన్ చైర్మన్ పదవితో సముచితస్థానం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.