byసూర్య | Tue, Jul 09, 2024, 03:45 PM
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు అశ్చర్యం కలిగించిందని ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓడినా 40శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ’పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా వచ్చేవని, జగన్ ను ఓడించేందుకు షర్మిలను పావుగా ఉపయోగించుకున్నారు. అంతకు మించి ఆమె పాత్ర ఏమీ లేదు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే‘ అని అన్నారు.