byసూర్య | Tue, Jul 09, 2024, 03:44 PM
హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రాష్ట్ర టూరిజం కార్యాలయంలో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. ప్రభుత్వ సహకారంతో వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆయనను సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందించారు.