byసూర్య | Tue, Jun 25, 2024, 03:20 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో వృద్ధులు పింఛన్ డబ్బులు రాలేదంటూ మంగళవారం రోడ్డెక్కారు. పాత బస్టాండు కూడలి వద్ద బైఠాయించారు. ఐదో తేదీలోగా చెల్లించాల్సిన పింఛన్ డబ్బులు నెలాఖరు కావస్తున్నా ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పింఛన్ డబ్బులు వేయకపోతే మరింత ఆందోళన చేస్తామన్నారు.