byసూర్య | Mon, Jun 24, 2024, 10:39 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులతో తలనీలాలు సమర్పించి సేవలో తరించారు. అందరిని చల్లగా చూడు రాజన్న తండ్రి అంటూ భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చక స్వాములు వేద ప్రత్యేక పూజలు నిర్వహించారు.