byసూర్య | Tue, Jun 18, 2024, 02:04 PM
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో కర్నూలు వెళ్ళే రోడ్డులో ఉత్తర ఫుడ్ కంపనీ దగ్గర టిఎస్ 33 సి 9462 స్కార్పియో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాగా స్థానికులు గమనించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.