byసూర్య | Tue, Jun 18, 2024, 02:21 PM
వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది బక్రీద్ పండుగ సెలవు రోజు అయినప్పటికి సోమవారం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి మిషన్ భగీరథ నల్లాల సర్వేను కొనసాగించారు. కార్యదర్శి పరుశరాం ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఇంటింటీకి తిరుగుతూ. నల్లాలు ఏ సమయంలో వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఆ కుటుంబానికి సరిపడా నీరు వస్తుందా లేదా? సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.