byసూర్య | Mon, Jun 17, 2024, 03:19 PM
స్వర్ణగిరి ఆలయం ప్రారంభమై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆలయ ఛైర్మన్ మానేపల్లి రామారావు ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్వామి వారి కృపతో అతి తక్కువ సమయంలోనే వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. మురళీ కృష్ణ, గోపికృష్ణ పాల్గొన్నారు.