byసూర్య | Sun, Jun 16, 2024, 08:13 PM
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని జాజాల - పోతారెడ్డిపల్లి గ్రామ శివారులో గల దుందుభి నది నుంచి సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆ గ్రామాల రైతులు ఆదివారం అధికారులను కోరారు. ఇసుక అక్రమ రవాణా ఆపకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కొండల్ రెడ్డి, స్వామి గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.