byసూర్య | Sun, Jun 16, 2024, 08:11 PM
వనపర్తి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలనాథస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలలో 7 కొండలు ఉన్నట్లుగానే తిరుమలనాథస్వామి గుడి (తిరుమలయ్య గుట్ట)లో సైతం 7 కొండలు, అరుదైన వృక్ష జాతులు, ఔషధ మొక్కల ఉనికిని వృక్షశాస్త్ర నిపుణులు గుర్తించారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి, ఆధ్మాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చాలని భక్తులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.