byసూర్య | Sun, Jun 16, 2024, 08:08 PM
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బక్రీద్ నమాజ్ వేళలని నిర్వాహకులు వెల్లడించారు. సోమవారం ఉదయం 8. 30 గంటలకు మస్జీదే అజంజాహి నుంచి ఊరేగింపుగా ఈద్గా వద్దకు చేరుకోవాలని ఉదయం 9: 00 గంటలకు నమాజ్ ఉంటుందని తెలిపారు. మస్జిదే నూర్లో ఉదయం 7. 30కు, మదర్సా మస్జీద్లో ఉదయం 8: 00 గంటలకు, మస్జిదే సయ్యదియాలో 8. 30గంటలకు, మస్జిదే ఆజంజాహిలో ఉదయం 9: 00 గంటలకు నమాజ్ ఆచరిస్తున్నట్లు పేర్కొన్నారు.