byసూర్య | Sun, Jun 16, 2024, 08:06 PM
బక్రీద్ పండగకు జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఈద్గాలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన కూడళ్లు, రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాహనాలను డైవర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. పండగను భక్తిశ్రద్ధలతో కులమతాలకు అతీతంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మకూడదని అన్నారు.