byసూర్య | Sun, Jun 16, 2024, 08:05 PM
నాగర్ కర్నూల్ వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం మిషన్ భగీరథ తాగు నీటి పథకంపై సర్వే కొనసాగింది. గ్రామ కార్యదర్శి ఖాజా సుజావుద్దీన్ సర్వే నిర్వహించారు. మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ ఉందా, ఎంతమంది ఇంట్లో మిషన్ భగీరథ నీటిని వాడుతున్నారనే అంశాలు సేకరించారు. నాలుగురోజులుగా గ్రామంలో సర్వే కొనసాగుతుందని త్వరలో పూర్తవుతుందని ఆయన తెలిపారు.