byసూర్య | Fri, May 31, 2024, 01:39 PM
బాలానగర్ మండలంలోని ఈదమ్మగడ్డ తండాలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజమ్మ (41) ఆమె భర్త శంకర్తో పాటు ఇద్దరు కుమారులు ఆస్తి పంపకం విషయంలో తరచూ గొడవపడేవారు. తల్లిని కుమారులు తిట్టడంతో బుధవారం పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందింది.