byసూర్య | Fri, May 31, 2024, 10:33 AM
ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు.