తెలంగాణలో దంచికొట్టనున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ

byసూర్య | Wed, May 29, 2024, 08:18 PM

తెలంగాణలో గతకొద్ది రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. సాధారణంగా మే నెలలో ఎండలు దంచికొట్టాల్సి ఉండగా.. ఈసారి మాత్రం అకాల వర్షాలు కురిశాయి. 20 రోజుల నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సమ్మర్ ఏప్రిల్ నెలలో హాట్ హాట్‌గా ఉండగా.. మే రెండో వారం నుంచి మాత్రం కూల్ కూల్‌గా గడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణశాఖ రాష్ట్రానికి అలర్ట్ జారీ చేసింది.


నేటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని చెప్పారు. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడని వెల్లడించారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అంటున్నారు. జూన్ మెుదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. నైరుతి రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.


ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుపాను కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మంగళవారం వర్షాలు కురిశాయి. తుఫాను ప్రభావం ఏపీ, తెంలగాణలపై తక్కువగానే ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రం జల్లులు కురిశాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచాయి.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM