కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం 'స్పెషల్' ఆపరేషన్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు

byసూర్య | Wed, May 29, 2024, 08:08 PM

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి.. రిమాండ్‌లో ఉన్నారు. కస్టడీలో ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుంజగరావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ జరిపిన తీరును, ఎవర్ని టార్గెట్ చేశారనే దానిపై కీలక విషయాలు వెల్లడించారు.


కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలో కేసీఆర్ కోసం ఎస్‌ఐబీ అధికారులు ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిసింది. స్పెషల్‌గా ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు భుజంగరావు, తిరుపతన్నలు తమ వాంగ్మూలాల్లో వెల్లడించారు. ఎన్నికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు తన బృందంతో కేఏంఆర్ పేరిట వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి.. రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిల కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ ఎప్పటికప్పుడు గ్రూప్‌లో సమాచారాన్ని షేర్‌ చేసుకునేవారని వెల్లడించారు.


కేసీఆర్‌ను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలో గ్రూప్‌లోనే చర్చించేవారని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమైన పనులు నిర్వర్తించే బాధ్యతను సీఐలు గట్టుమల్లు, రాజవర్ధన్‌రెడ్డి, నరేష్‌ గౌడ్‌ తదితరులకు అప్పగించినట్లు చెప్పారు. టార్గెట్ చేసుకున్నవారి ఫోన్లు ట్యాప్‌ చేసి... ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని ప్రణీత్‌రావు వారికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొండల్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులపై కన్నేసి ఉంచడం ద్వారా కామారెడ్డి పోలీసులు రూ.56.84 లక్షలు స్వాధీనం చేసుకున్నారని తిరుపతన్న వెల్లడించారు.


2018 ఎన్నికలకు ముందు ఎస్‌ఐబీని ఏర్పాటు చేయగా.. ఆ ఎన్నికలతో పాటు 2019 పార్లమెంట్, ఆ తర్వాత వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఈ టీంను ప్రభుత్వం వాడుకున్నట్లు నిందితులు తమ వాంగ్మూలంలో వెల్లడించారు. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్‌ చేసినట్లు తాజాగా కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌తో బహిర్గతమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ట్రోల్‌ చేసే వ్యక్తులతో పాటు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందిపెట్టే విద్యార్థి సంఘాల నేతల ఫోన్లు, ఈటల రాజేందర్‌ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌ అయినప్పుడు.. ఆ తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నికప్పుడు.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై నిరుద్యోగ యువత ఆందోళనలు నిర్వహించినప్పుడు.. కేటీఆర్‌ కామెంట్లపై ఆందోళనలు జరిగినప్పుడు.. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులాంటి సందర్భాల్లో క్షేత్రస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM