byసూర్య | Wed, May 29, 2024, 11:04 AM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి కృష్ణ, తుంగభద్ర నదీ జలాలతో పుణ్యస్నానం చేయించారు. అనంతరం వస్త్రాలంకరణ, నైవేద్యం, మహా మంగళహారతి, ప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వరుస కట్టారు.