byసూర్య | Wed, May 29, 2024, 10:27 AM
ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా బతికి బయటపడ్డ ఘటన గండీడ్ మండల పరిధిలోని అంచన్పల్లి గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన గ్రామకార్యదర్శి మండల కేంద్రంలోని సమావేశానికి బయలుదేరారు. ఎదురుగా వచ్చే మరో కారు కార్యదర్శి కారును ఢీకొనగా ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.