byసూర్య | Mon, May 27, 2024, 07:09 PM
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల రైతులకు సోమవారం యాసంగిలో విత్తనాల ఎంపిక, విత్తనాల కొనుగోలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయ విస్తరణ అధికారి రాజాగౌడ్ మాట్లాడుతూ. రైతులు ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ ఉన్న డీలర్ ద్వారానే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మితే తీసుకోకూడదని, రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలన్నారు.