హనుమకొండ జిల్లాలో విషాదం

byసూర్య | Thu, Oct 24, 2024, 08:16 PM

హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్‌ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత(36) విషజ్వరంతో ఆర్టీసీ బస్సులో(RTC bus) గురువారం మృతి(Woman dies) చెందింది.గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవిత జ్వరంతో బాధపడుతుండడంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.అక్కడ వైద్యం చేయించుకుని తిరిగి స్వగ్రామానికి భర్త కుమారస్వామితో ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. గూడూరు గ్రామం వద్దకు రాగానే చెమటలు పట్టి స్పృహా కోల్పోయింది. నిద్రపోయి ఉండవచ్చనుకున్న భర్త వంగపల్లి రావడంతో కిందకు దిగేందుకు లేపడంతో లేవలేదు. బస్సులో కూర్చున్న సీటులోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


 


 


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM