byసూర్య | Mon, May 27, 2024, 06:34 PM
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం పీహెచ్సిలో అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన చెన్నమ్మ పురిటి నొప్పులతో అడ్మిట్ అయ్యారు. వైద్యుల సూచనలు మేరకు ఆమెను అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి సోమవారం తరలిస్తుండగా మార్గం మధ్యలో పురిటినొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ లో ఆమె నార్మల్ డెలివరీ కాగా ఆడబిడ్డ జన్మించినట్లు ఈఎంటి శశికుమార్, పైలెట్ మహేష్ తెలిపారు. అనంతరం ఆమెను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించామన్నారు.