byసూర్య | Mon, May 27, 2024, 06:33 PM
జడ్చర్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం సంస్కార భారతి కార్యాలయంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్కార భారతి సభ్యుడు గోనెల రాధాకృష్ణ మాట్లాడుతూ వితంతు మహిళల జీవితంలో వెలుగులు తీసుకొచ్చిన సంఘసంస్కర్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి, గోపాల్ గౌడ్, మహిళలు పాల్గొన్నారు.