byసూర్య | Mon, May 27, 2024, 06:23 PM
నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ యోగేశ్ గౌతమ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను నేరుగా బాధితులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అన్నారు.