byసూర్య | Mon, May 27, 2024, 06:09 PM
జులై ఒకటి నుండి అమలు కానున్న నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫిరెన్స్ హాలులో జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నూతన చట్టాలు అమలు చేస్తున్న నేపథ్యంలో కేసులలో దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన విధానాలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని చెప్పారు. డిఎస్పీలు పాల్గొన్నారు.