byసూర్య | Mon, May 27, 2024, 06:08 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర రమాబాయి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు నగర్ దొడ్డి వెంకట రాములు, దండోరా ఆంజనేయులు, మెడికల్ తిరుమల్ రెడ్డి, మారెప్ప, రంగు మద్దిలేటి, స్వామిదాసు తదితరులు పాల్గొన్నారు.