byసూర్య | Mon, May 27, 2024, 06:05 PM
మాగనూరు మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను మండల విద్యాధికారి సుదర్శన్ గౌడ్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా డీలర్ల స్టాకు రికార్డులు, బిల్ బుక్కులు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలతో పాటు, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పర్మిషన్ ఉన్న కంపెనీ నుండి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని డిలర్లకు సూచించారు.