byసూర్య | Mon, May 27, 2024, 05:58 PM
పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మల్లేశ్వరం దారిలో ఉన్న బ్రిడ్జి పై రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని సోమవారం మంత్రిజూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వరిధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మంత్రి జూపల్లి రైతులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వాటికి సంబందించిన డబ్బులు వారికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.