byసూర్య | Mon, May 27, 2024, 05:48 PM
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం రాత్రి గ్రామంలోని ఈరటి మల్లేశం యాదవ్కు చెందిన దొడ్లో వీధి కుక్కలు గొర్రెలపై దాడి చేశాయి. ఈ ఘటనలో 30 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. మల్లేశం యాదవ్ 100 గొర్రెలు ఉండగా కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.