byసూర్య | Sun, May 26, 2024, 05:22 PM
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైరా నియోజవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అన్నారు. ఆదివారం కారేపల్లి BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.