byసూర్య | Sun, May 26, 2024, 05:20 PM
హైద్రాబాద్ లోని ఐఆర్ఆర్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలంకు చెందిన బొద్దోజు పూజిత్రమ్ (16) మృతి చెందాడు. మేడ్చల్ నుంచి శామీర్పేట వెళ్తున్న దారిలో తన తండ్రితో ప్రయాణిస్తున్న బాలుడు పూజిత్రమ్ వామిటింగ్ చేసుకోవడానికి కారును పక్కన ఆపారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బాలుడును ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి సారపాకలోని బీపీఎల్ లో ఎంప్లాయిగా పనిచేస్తున్నారు.