byసూర్య | Sun, May 26, 2024, 05:11 PM
కారేపల్లి మండల కేంద్రం నుండి వయ భాగ్యనగర్ తండా వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రైల్వే గేటును సంబంధిత రైల్వే అధికారులు పదే పదే మూసి వేస్తూ ఉండటంతో ఆ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు గంటల కొలది నిరీక్షించాల్సిందే. అయితే ఈ రైల్వే గేట్ సమీపంలో నుండి సంబంధిత అధికారులు ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతామని ఇప్పటికే పలుమార్లు సర్వే నిర్వహించారు. కానీ కార్య రూపం దాల్చలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.