![]() |
![]() |
byసూర్య | Wed, May 22, 2024, 02:27 PM
తుర్కయంజాల్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా బుధవారం పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ రవివర్మ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు శోభానగర్ ఫీడర్ పరిధిలోని శోభానగర్, వింటేజ్ హోమ్స్, ఏవీనగర్, కుర్మగూడ, వైఎస్ఆర్ నగర్, సినర్జీ హోమ్స్, ద్వారకానగర్, తుర్కయంజాల్, బృందావన్ కాలనీ, శ్రీ సాయిహోమ్స్, వాసవీ కాలనీ, శివసాయి కాలనీలో సరఫరా నిలిపివేయనున్నారు.